- Advertisement -
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత టి. ఆర్.ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి.. తన సమీప ప్రత్యర్థి రామచందర్రావుపై(బిజేపి) 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఏడు రౌండ్లు పూర్తయినా.. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాని నేపథ్యంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానుంది. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు.
అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడో రౌండ్ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ పాస్..!