టీపీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఉత్తమ్కుమార్రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కబోతున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా ప్రస్తుతం రంజన్ చౌదరి కొనసాగుతున్నారు. అయితే ఆయన స్థానంలో మరో ఎంపీని నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నదట. ఇందుకోసం పలువురు కీలక నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ఉత్తమ్ కుమార్రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం.
జూలై 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించబోరని ఇప్పటికే ఆ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు గతంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై లేస్ ఖాస్త్రం సంధించిన నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. గతంలో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుబడుతూ సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ గ్రూప్లో మొత్తం 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరిలో ఒకరికి లోక్సభపక్షనేత పదవి దక్కే చాన్స్ ఉందన్న వార్త వినిపిస్తోంది.
ఈ లిస్ట్లో శశి థరూర్, మనీష్ తివారీ ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకమయ్యాక.. ఉత్తమ్కు జాతీయస్థాయిలో కీలక పదవి దక్కుతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన పేరు వినిపిస్తోంది. అధిర్ రంజన్ చౌదరి ప్రస్తుతం లోక్సభాపక్ష నేత గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను లోక్సభపక్షనేతగా ఈ పదవి నుంచి తప్పించబోతున్నారు.
Also Read