వల్లబనేని వంశి నారా భువనేశ్వరికి క్షమాపణలు చప్పారు. అసెంబ్లీలో ఆయన చంద్రబాబు కుటుంబంపై అనుచితంగా మాట్లాడారా ? కొడాలి టీడీపీదే తప్పు అని ఎందుకు అంటున్నారు ? వైసీపీ నేతల మౌనం వెనుక రహస్యం ఏంటి ? ఇప్పుడు ఏపీ రాజకియాల్లో ఇదే హట్ టాఫిక్గా మారింది.
వైసీపీ ఎమ్మెల్యే వల్లబనేని వంశి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దేవికి క్షమాపణలు చెప్పారు. తనకు నోరు జారిందని తనను క్షమించాలని ఆయను భువనేశ్వరిని కోరారు. దీంతో ఏపీ రాజకీయం మరో మలుపు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాను అసెంబ్లీలో ఆలా మాట్లాడలేదని బయట ఏదో అనబోయి మరేదోఅనన్ననాని వంశి తెలిపారు. భువనేశ్వరీ తనకు అక్కలాంటిదని ఆయన అన్నారు.
దీంతో ఈ సమస్యకు పులిస్టాఫ్ పడ్డట్లే అనుకున్నారంతా కానీ మంత్రి కొడాలి నాని వంశికి మద్దతు పలుకుతున్నారు. వంశీ అలా మాట్లాడటానికి టీడీపీ నేతలే కారణమని టీడీపీ నాయకులు విమర్శలు చేయకుంటే అతని నుంచి అలాంటి మాట వచ్చేది కాదన్నారు. ఆ మాట రాకుంటే ఇంత పెద్ద రాంద్దాంతం జరిగి ఉండేది కాదన్నారు. మరోవైపు వంశీకి మద్దతు ఇచ్చేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడం లేదు. చీమ చిటుక్కువంటే మీడియా ముందుకు వచ్చే వైసీపీ మంత్రులు ఇప్పుడు గాలికి పోయే దానిని అంటించుకోవడం అవసరామా అని అనుకుంటున్నారట.
ఆలస్యంగా సీఎం టూర్ వెనక మర్మమేంటి..?