సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉన్నా ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపార్టీ నుంచి ఎవరు ఏపార్టీలోకి వెల్తారో అర్థంకాని పరిస్థితి. పార్టీలో తగిన గుర్తింపులేని నాయకులందరూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అది అధికారపార్టీ అయినా లేకా ప్రతిపక్ష పార్టీఅయినా సరే వెల్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లాలో టీడీపీకి తర్వరలో పెద్ద షాక్ తగలనుందనే వార్త నేపథ్యంలో పచ్చపార్టీలో అలజడి మొదలయ్యింది.
రాయలసీమలో జగన్ను 2019 ఎన్నికల నాటికి దెబ్బ కొట్టాలని చూస్తుంటే…వైసీపీ కూడా టీడీపీకి పట్టున్న కృష్ణాజిల్లాపై ఫోకస్ పెట్టింది. విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి వైసీపీలోకి రాబోతున్నారు. యలమంచిలి వైసీపీలో చేరబోతున్నారన్న వార్త కృష్ణా టీడీపీలో అలజడి రేపుతోంది. జగన్ పాదయాత్రలో వైసీపీ ఖండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
యలమంచలి రవి 2009లో పీఆర్పీతరుపున పోటీ చేసి వినేని నెహ్రునే ఓడించారు. తర్వాత టీడీపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ సీటు ఆయనకే ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దె రామ్మోహన్కు టికెట్ ఇచ్చారు. అప్పటినుంచి టీడీపీకీ దూరంగా ఉన్నారు. ఇటీవల టీడీపీ కార్యక్రమాలకు ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందకుండా టీడీపీ నేతలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఖండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు.
యలమంచిలి రవిని వైసీపీలోకి తీసు కొచ్చేందుకు కొడాలి నాని, వంగవీటి రాధా కీలక పాత్ర పోషించారు. జగన్ పాదయాత్రలో ఆయన వైసీపీలో చేరనున్నారు. విజయవాడలో టీడీపీ గట్టి మద్దతుదారులుగా ఉన్న ఒక సామాజికర్గం ఓట్లను రవి ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు.