విజయవాడ టీడీపీలో ఓ వైపు అంతర్గత పోరు..మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు వెరసీ టీడపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఎంపీ కేశినేని నాని పార్టీని వీడిన దగ్గరి నుండి టీడీపీ నుండి రోజుకో నేత వైసీపీలో చేరుతునే ఉన్నారు. తాజాగా విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ చేరారు. వెంకటరమణ పార్టీని టీడీపీకి గట్టి దెబ్బే. త్వరలోనే మరికొంతమంది నేతలు సైతం టీడీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పార్టీని వీడుతున్న నేతలు ఒకవైపు అయితే మరోవైపు విజయవాడ వెస్ట్ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన ్తీవ్రంగా పోటీ పడుతున్నారు. సీటు తమకంటే తమకేనని బలప్రదర్శన కూడా చూశారు.
ఓవైపు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేతలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు హల్ చల్ చేస్తున్నారు. బుద్దా వెంకన్న వర్గం ఓ వైపు ర్యాలీ చేపడితే మరోవైపు జలీల్ ఖాన్ వర్గం సైతం ర్యాలీ తీసింది. దీంతో విజయవాడ టీడీపీలో జరుగుతున్న పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి.