నంద్యాల ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.నాయకుల మధ్య సవాల్లు….ప్రతి సావాల్లు …మాటలయుధ్దం ముదిరిపాకాన పడుతోంది.అయితే ఇప్పుడో కీలక పరినామం చోటు చేసుకుంది.ఇది అధికార టీడీపీకి కోలుకొలేని దెబ్బతగిలింది.ఉప ఎన్నిక ప్రచారంలో మరో కీలక నాయకుడు ప్రచారానికిడుమ్మాకొట్టారు.దీనికి ప్రధాన కారనం ఇద్దరి కుటుంబాల మద్య ఉన్న విబేధాల వల్లచేనని ప్రచారం కొనసాగుతోంది.
భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయనకు రైట్ హ్యాండ్..నంద్యాల మున్సిపాల్టీలో కీలకమైన వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి. నంద్యాలలో గత మూడు రోజులుగా టీడీపీ ప్రచారంలో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలిస్తోంది. భూమా చనిపోయిన తర్వాత మంత్రి అఖిలప్రియతో ఈయనకు విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి ఈయన భూమా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు.
ఇలాంటి సమయంలో సుబ్బారెడ్డి పార్టీకి దూరమయితే మొదటికే మోసం వస్తుందని వెంటనే చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. అఖిల ప్రియను పట్టించుకోవద్దని చెప్పారు. తాను అన్నీ సెట్ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ మారే నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈయనను ఎవరూ పట్టించుకోవడంలేదంట. నంద్యాలలో చక్రం తిప్పి పార్టీ నుంచి వెళ్లిన కౌన్సిలర్లను తీసుకొస్తే తనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వడం లేదని ఈయన అంటున్నారట. అప్పుడు ఏదో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు..ఎన్నికల దగ్గర పడేసరికి తనను పక్కన పెట్టారని ఫీలవుతున్నారట. తనను వాడుకుని వదిలేశారని మథనపడుతున్నారట.
దీంతో ఈయన ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. వైసీపీ నేతలకు ఆయన ఇప్పటికే టచ్లోకి వచ్చారని సమాచారం. త్వరలోనే నంద్యాల ఎన్నికకు ముందే టీడీపీకి బలమైన షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.