Thursday, May 16, 2024
- Advertisement -

బాబుపై మాట తూటాల‌ను పేల్చిన జ‌గ‌న్.

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా బాబు మాట‌ల తూటాలు పేల్చారు. 255వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సబ్బవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో బాబు దుమ్ము దులిపారు.బాబు పాల‌న‌లో గజానికో కబ్జా కోరు తయారయ్యారని ఫైర్ అయ్యారు. అక్రమాలకు పెదబాబు పర్మిషన్‌ ఇస్తే చినబాబు కమిషన్‌ వసూలు చేస్కుంటాడని ధ్వజమెత్తారు. రికార్డుల తారుమారుతో పెందుర్తిలో పేదవాడి అసైన్డ్‌ భూములను లాకున్నారని ఆరోపించారు.

భూమి కనిపిస్తే చాలు అమాంతం మింగెస్తున్నారని, ఈ భూ బకాసురులను ఓటు అనే ఆయుధంతోనే అంతమొందించాలని పిలుపు ఇచ్చారు. విశాఖ భూ కబ్జాలకు నిలయంగా మారిందని జగన్ ఆరోపించారు. అమ్మకానికి వీలులేని లేని అసైన్డ్‌ భూములను చంద్రబాబు బీనామీలతో తక్కువ ధరకే కొనుగోలు చేయించారని మండిప‌డ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు.జిల్లాలో ఎక్కడ చూసినా భూముల స్కాములే కనిపిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భూ దందాలకు పెదబాబు చినబాబు మద్దతుగా ఉన్నారని జగన్ ఆరోపించారు. వారి అండ చూసుకునే రెచ్చిపోతున్నారని అన్నారు. ఎక్కడా కూడా కనీసం గజం జాగా కూడా వదలకుండా మెక్కేశారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న అన్ని స్కాముల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెదబాబు, చినబాబుల పాత్ర ఉందని విమర్శించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇలాకాలో జరగడం విశేషం. జగన్ సభ రీ సౌండ్ కి తమ్ముళ్ళ గుండెలదిరేల సభ సాగిందని వైసీపీ హ్యాపీగా ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -