పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి సెటైర్లు సంధించారు. ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఫోన్ లో సూర్యుడితో మాట్లాడి పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని చెబుతారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
బాబు నోరు తెరిస్తే అబద్ధాలు, సొంత డబ్బా తప్ప పనికొచ్చే మాట ఒక్కటీ మాట్లాడని ఎద్దేవ చేశారు. స్వాతంత్ర్యపోరాటం జరిగినప్పుడు నిక్కరు కూడా తొడగని చంద్రబాబు.. నేనే స్వాతంత్ర్యం తెచ్చానంటాడు. ఇంకా నయం.. అప్పుడుగిన ఆయన ఏ నాయకుడో అయి ఉంటే.. స్వాతంత్ర్యం మనకెందుకు.. బ్రిటిష్ వారితో లాలూచీ పడదాం అనేవాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ మహానుభావుడు దోమలమీద దండయాత్ర చేశాడట. ఒక్క శాశ్వత భవనమూ కట్టలేదుగానీ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాడట. అంతేనా, కంప్యూటర్లు, సెల్ఫోన్లు కనిపెట్టానంటాడు. ప్రైవేట్ జెట్లలో విదేశాలకు పోయి.. ఏ దేశానికి పోతే ఆ దేశం నుంచి ఏదో వచ్చేస్తుందంటాడు.
పాపం సత్యా నాదెండ్ల కష్టపడి చదివి పైకొచ్చి, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో అయితే.. నా వల్లే అని క్రెడిట్ లాగేసుకుంటాడు చంద్రబాబు. సింధు చమటోడ్చి షెటిల్ ఆడితే.. ఆమెకు ఆట నేర్పించిందే నేనని చెప్పుకుంటాడు. ఈ మధ్య ఇంకోటి.. ఎండలు తగ్గించాలట! 10 డిగ్రీల ఎండను తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాడు.. సూర్యుడితో ఫోన్లో మాట్లాడి తగ్గిస్తాడేమో
తమ 23 మంది శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబుకు కర్ణాటకలో ప్రజాస్వామ్యం బతికిందని అనే అర్హత ఉందా అని చంద్రబాబు అడిగారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అన్నీ చేసేశానని చంద్రబాబు చెబుతారని, ఆ విషయమే చంద్రబాబు అనుకూల మీడియా రాస్తుందని అన్నారు.