వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన చెల్లి వైఎస్ షర్మిల మద్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మద్య ఓ ఇంటర్వ్యూ లో షర్మిల కూడా విభేదాలపై స్పందించిన తీరు కూడా విభేదాలు వాస్తవమే అనే వార్తలకు బలం చేకూర్చాయి. ఇక విభేదాల కారణంగానే ఆంధ్రాలో కాదని తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెట్టిన షర్మిల.. ఇక ఏపీ రాజకీయాలపై అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నారు. అమద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పులో కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది షర్మిల. దీంతో అన్న చెల్లెళ్ల మద్య దూరం వాస్తవమే అని స్పష్టమైంది. ఇక వైసీపీ ప్లీనరీ సభలో వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ మద్య పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడంతో పాటు.. తన కూతురి షర్మిలతోనే ఉంటానని చెప్పింది. దీంతో తల్లి చెల్లి లను దూరం చేసుకున్నాడని జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. షర్మిలను చూడడానికి వైఎస్ జగన్ వచ్చే అవకాశం ఉందా అని ” ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్రంతో.. జగన్ తో మనకేం పని ” అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో జగన్ను విజయమ్మ ఏ స్థాయిలో దూరం పెట్టారో అర్థమౌతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. ఇక వైఎస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో అరెస్ట్ కావడం, టిఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల వాహనాలపై దాడులకు పాల్పడడం వంటి పరిణామాలతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హాట్ టాపిక్ గా మారింది. మరి షర్మిల అరెస్ట్ పై వైఎస్ జగన్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి