ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, టిడిపిపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నంద్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా ఊగిపోయారు.అఖిలతో సహా అందరిని దుమ్ముదులిపారు.
తన తండ్రి కోసం మరణించిన వారికి అండగా ఉండానని జగన్ నల్ల కాలువ వద్ద చెప్పారని, అందు కోసం ఈ రోజు వరకు పోరాడుతున్నారన్నారు. అన్ని పార్టీలు కక్ష కట్టి జగన్ను జైలుకు పంపించాయని, ఆయన కుటుంబాన్ని వేధించాయన్నారు. కానీ ఏం జరిగింది… అక్కడ ఉన్నది జగనన్న అని, రాయలసీమ ముద్దుబిడ్డ అన్నారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని అన్నారు. మరోసారి ఓటేస్తే ఇక అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని పార్టీలు కలిసి వైఎస్ జగన్పై కక్షగట్టి కేసులు పెట్టారు. అయినా వైఎస్ జగన్ ఏం చేయలేదు. ఎందుకంటే వైఎస్ జగన్ రాయలసీమ ముద్దు బిడ్డ.. రాజశేకర్రెడ్డి పౌరుషం. అప్పటి నుంచి మాట తిప్పలేదు.. మడమ తిప్పలేదు. అసలు ఎన్నికలు ఎందుకొచ్చాయో ప్రజలు ఆలోచించాలి. 21మంది ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొని ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడవడంవల్ల ఈ ఎన్నికలు వచ్చాయి.
నంద్యాల గడ్డ చంద్రబాబుకు అబ్బా అనేలా ఉండాలని రోజా అన్నారు. 2014లో చంద్రబాబుకు ఓటు వేసి, గెలిపించి మూడేళ్లుగా దగాపడ్డామన్నారు. అరాచకానికి, వెన్నుపోటుకు చంద్రబాబు ట్రంప్ కార్డ్ అన్నారు. ఇప్పుడు నంద్యాల ప్రజల వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు అన్నారు.
చంద్రబాబు అంటేనే అవినీతికి ఆధార్ కార్డు.. అరాచకాలకు పాన్ కార్డు.. ఈ కార్డులు చింపేది మీ ఓటరు కార్డు. చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడాలి. మహిష్మతి బాహుబలిదే నంద్యాల వైఎస్ఆర్దే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అని రోజా ధ్వజమెత్తారు.