Friday, May 17, 2024
- Advertisement -

ఇడుపులపాయ నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్‌రెడ్డి చేప‌డుతున్న ప్ర‌జాసంక‌ల్పం పాద‌యాత్ర తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్ది అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికె బాబునుంచి మంత్రుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు జ‌గ‌న్‌మీద విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెల‌సిందే. అదే రీతిలో వైసీపీ కూడా అదికార‌పార్టీ మాట‌ల‌కు ధీటుగా స‌మాధాన మిస్తోంది. తాజాగా ఆపార్టీనేత త‌ల‌శిల ర‌ఘురామ్ అదికార‌పార్టీపై విరుచుకుప‌డ్డారు.

నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని రఘురామ్‌ చెప్పారు. కడప జిల్లాలో 7 రోజులపాటు మొత్తం వంద కిలోమీటర్లు యాత్ర కొనసాతుందన్నారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు.. ఇలా ఐదు నియోజకవర్గాల కొనసాగే యాత్ర ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారని.. ప్రజలందరినీ ఆయన కలుస్తారని రఘురామ్‌ తెలిపారు.

గతంలో వైఎస్సాఆర్‌సీపీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని.. అన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని, ఇప్పడు కూడా శాంతియుత వాతారణంలోనే కొనసాగుతుందన్న నమ్మకం ఆయన వ్యక్తంచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం యాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తోందని రఘురామ్‌ చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం అయితే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడట్లేనన్న భయంతో తెలుగుదేశం నేతలు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు.

ప్రజా స్వామ్య దేశంలో పాదయాత్రలు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభం యాత్రతో ప్రజా సంకల్ప యాత్రకు సంబంధం లేదని. ముద్రగడ చేపట్టింది కాపు హక్కుల పోరాటం అని, కానీ, ప్రతిపక్ష నేతగా, వైఎస్ జగన్ ప్రజా హక్కుల కోసం.. వారి సమస్యలు వినిపించేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని.. జన నేతకి ఆహ్వానం పలికేందుకు 13 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘురామ్‌ చెప్పారు. వైఎస్ స్వ‌ర్ణ‌యుగం కోస‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌డుతున్నార‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -