Wednesday, May 22, 2024
- Advertisement -

చంద్రబాబు పాపం పండింది.. జైలుకు వెళ్లడం ఖాయం… రోజా

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రో సారి ఫైర్ అయ్యారు. పోలీసులపై వేసిన వ్యక్తిగత కేసు విచారణలో భాగంగా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు వైకాపా ఎమ్మెల్యే రోజా ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వైకాపా నేతలు ఆమెకు స్వాగతం పలికారు.

ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయినా ఆ సంభాషణలు తనవి కావంటూ బుకాయించటం దారుణమని మండిపడ్డారు. భాజపా, వైకాపా, తెరాస కలిసి కుట్రపన్ని ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని తెదేపా నేతల అనడం సిగ్గుచేటన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే ఇక్కడ చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్‌’ అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చంద్రబాబు కులదోసేస్తాం అంటే ఉరుకుంటారా? ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉంది. బీజేపీతో లాలుచి పడింది చంద్రబాబే. బ్రీఫ్డ్ మీ అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని కేటీఆర్‌ అప్పుడే చెప్పార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఎన్డీయేతో కలిసి ఉన్నప్పడే ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమని అన్నారు. ఆ కేసు నుంచి తప్పించాలని చంద్రబాబు.. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బతిమాలిన సంగతి మరిచిపోయారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -