Thursday, May 9, 2024
- Advertisement -

మాజీ మంత్రి యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్..!

- Advertisement -

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏంపీ విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా టీడీపీ నేత మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి తీరును ఎండ‌గ‌ట్టారు. “ఆర్థిక నిర్వహణలో వరస్ట్ ఫైనాన్స్ మినిష్టర్ గా అపకీర్తి మూటకట్టుకున్న యనమల ఖజానా లోటు గురించి మాట్లాడటం చంఢాలంగా ఉంది. పరిమితికి మించి అప్పులు చేశాం, ఇకపై రూపాయి రుణం కూడా పుట్టదు అని నిస్సిగ్గుగా చెప్పింది ఆయనే. వంద కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లిన చరిత్ర మరిస్తే ఎలా ” అంటూ ట్వీట్ చేశారు.

కొత్త రైతుబజార్ల ఏర్పాటుకు సంకల్పం… ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ గారు రాష్ట్రంలో కొత్త రైతుబజార్ల ఏర్పాటుకు సంకల్పించారు. రూ.52.02 కోట్లతో 60 రైతుబజార్లను ఏర్పాటు చేస్తుండగా వీటిలో 6 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Also Read

ఎమర్జెన్సీకి ఒకే నంబర్​.. అతి త్వరలో అమల్లోకి

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -