Thursday, May 9, 2024
- Advertisement -

పూటకో మాట.. రోజుకో మీటింగ్.. వారానికో కొత్త డిజైన్..

- Advertisement -

కొన్ని రోజులుగా వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే రోజా సైలెంట్‌గా ఉన్నారు. ఎక్క‌డా కూడా రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ‌లేదు. అయితె రోజాపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటికి చెక్ పెట్టింది రోజా. మ‌రో సారి చంద్ర‌బాబుపై బ‌ర‌స్ట్ అయ్యారు.

లండ‌న్‌కు చెందిన నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ అందించిన డిజైన్లను బాబు తిర‌స్క‌రించ‌డంతో డిజైన్ల ఖ‌రారుపై స‌స్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై సోషియ‌ల్ మీడియా ద్వ‌రా రోజా ఘాటుగా విమ‌ర్శించారు. అమరావతి భ్రమరావతే అని ఎద్దేవా చేశారు. పూటకో మాట, రోజుకో మీటింగ్, వారానికో కొత్త డిజైన్, పక్షానికో విదేశీ యాత్ర, నెలకో తాత్కాలిక భవనానికి శంకుస్థాపన అంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

త‌డుకులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని, చిత్తూరు జిల్లాకు పుత్తూరు ఏమన్నా డంపింగ్ యార్డా అని రోజా ప్రశ్నించారు. ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇవ్వని చంద్రబాబు, ఇప్పుడు చెత్తను రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నగరిలో ఈటీపీ ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకొని ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎందుకు స్పందించడం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -