Monday, May 6, 2024
- Advertisement -

వైనాట్ 175..జగన్ లెక్క పక్కా!

- Advertisement -

టీడీపీ నేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయ పరిస్ధితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో 152 స్ధానాల్లో గెలిచి జగన్‌ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీని కేవలం 23 స్ధానాల్లో మాత్రమే విజయం సాధించి పార్టీ ఆవిర్భావం నుండి ఎప్పుడులేని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక అధికారంలోకి వచ్చిన సంవత్సరం జగన్ తీసుకువచ్చిన నినాదం వైనాట్ 175. ఈసారి 175 స్ధానాల్లో గెలిచి టీడీపీని భూస్ధాపితం చేస్తామని శపథం చేశారు జగన్‌. అందుకు తగ్గట్టుగానే కార్యచరణ ప్రకటించారు. అయితే వైసీసీ నేతలే వైనాట్ 175పై పెదవి విరుస్తున్నారు. అయితే జగన్ రీసెంట్‌గా కర్నూల్ జిల్లా డోన్‌లో సంఖ్య తగ్గినా నేనే సీఎం అని వ్యాఖ్యానించడంతో గతంలో వచ్చిన స్ధానాలు కూడా రావడని ఆయనే ఒప్పుకున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక పలు సర్వేల పేరిట వైసీపీ గెలిచే స్ధానాల సంఖ్య ఇదేనంటూ నెంబర్ గేమ్ ఆడుతున్నారు. కొన్నిసర్వేలు 130 స్ధానాలు అని చెబుతుండగా మరికొన్ని సర్వేలు 120,100 అని చెబుతున్నాయి. అయితే ఎవరెన్ని లెక్కలు చెప్పినా జగన్‌కున్న అంచనాలు పక్కాగా ఉన్నాయని చెబుతున్నారు నేతలు. జగన్ మాటలను కొంతమంది వక్రీకరిస్తున్నారని ఈసారి ఏపీలో వైసీపీ గతంలో వచ్చిన స్ధానాలకంటే ఎక్కువ స్ధానాలను గెలవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా జగన్‌ లెక్కమాత్రం పక్కాగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -