మహిళలపై రోజురోజుకి అరాచకాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఓ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏం చేయడానికి అయిన తెగించేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఏదో బయట పని ఉండటంతో అది ముగించుకుని తిరిగి బయలు దేరుతున్న ఇద్దరు మహిళా డాన్సర్లపై 12 మంది దుండగులు తమ దగ్గరున్న తుపాకులతో బెదిరింది కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఆగ్రా నగరంలో జరిగింది.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలో 50 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రైవేటు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు రాజ్, జితేందర్ అనే ఇద్దరు వ్యక్తులు. ఈ కార్యక్రమాన్నికి డాన్సర్లను పిలిచారు. మథుర నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. అందుళో ఒకరు గర్భవతి. ప్రోగ్రాం మధ్యలో ఏదో గొడవ జరగడంతో అక్కడ నుంచి వెళ్ళిపోండి అని నిర్వాహకులు చెప్పారు. అయితే నిర్వాహకులే మథురలో దింపేస్తాం అని కారులో వాళ్ళను తీసుకెళ్ళారు. అయితే వేళ్లే దారిలో కొంతమంది మోటర్ సైకిళ్లపై వారిని వెంబడించారు.
ఆ గ్రామాని దాటిన తర్వాత ఆ కారును ఆపేశారు. మొత్తం 10, 12 మంది ఆ కారులో ఉన్న వారిపై దాడి చేసారు. అయితే ఆ ముగ్గురి మహిళల్లో ఒకరు గర్భవతి కావడంతో ఆమెను వదిలేసి మిగితా ఇద్దరిని ఓ రూంలోకి తీసుకెళ్లి వారిపై రెండు గంటలపాటు అత్యాచారం చేశారు. తమని విడిచిపెటమని ప్రాధేయపడినా.. వారు వదిలి పెట్టలేదట. ఒకరి తర్వాత ఒకరు దారుణంగా రేప్ చేసారట. అరవద్దు అని తమ దగ్గర ఉన్న తుపాకులతో బెదిరించారట. తర్వాత బాధిత మహిళలు ఇద్దరూ ఆగ్రా పోలీసు స్టేషన్ కు వెళ్లి.. తమపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షోని నిర్వహించిన రాజ్, జితేందర్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇతరుల నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Related