Friday, May 17, 2024
- Advertisement -

క‌ర్నూలులో క‌ల‌క‌లం రేపిన రేవ్ పార్టీ…..గొడ‌వ ప్రారంభం అయ్యింది అక్క‌డే

- Advertisement -

క‌ర్నూలులో ఏర్పాటు చేసిన రేవ్‌పార్ట క‌ల‌క‌లం రేపింది. దీపావళి సందర్భంగా గురువారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓ ఫెర్టిలైజర్ కంపెనీ ఏజెంట్లు పార్టీ ఏర్పాటు చేశారు. అందులో జరిగిన రభస తీవ్ర చర్చనీయాంశం కాగా, పలువురు ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఓ ఫర్టిలైజర్ సంస్థ కల్లూరు సమీపంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అశ్లీల నృత్యాలు చేసేందుకు, ఆపై ఏజంట్లతో ఏకాంతంగా గడిపేందుకు ముంబై, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాల నుంచి కొందరు యువతులను నిర్వాహకులు రప్పించారు.

మందు, విందుతో పాటూ డ్యాన్సర్లను తీసుకొచ్చి చిందులేశారు. మద్యం మత్తులో ఏజెంట్లు డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో నిర్వాహకులు.. యువతుల మధ్య వాగ్వాదం నడిచింది. పార్టీలో పాల్గొన్న ఏజంట్ల సంఖ్య అధికంగా ఉండటం, డ్యాన్సులు వేసేందుకు వచ్చిన యువతుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే గొడవ ప్రారంభమైనట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. తర్వాత ఆ డ్యాన్సర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అమ్మాయిలతో తాము డ్యాన్సులు వేస్తామంటే, తాము వేస్తామంటూ ఒక్కసారిగా ఏజంట్లు వేదిక పైకి చేరుకోవడం తీవ్ర రసాభాసకు కారణంకాగా, ఆపై అమ్మాయిలతో ఏకాంతంగా గడిపేందుకు ఏజంట్లు పోటీ పడ్డారు. అక్కడి వాతావరణంపై అసహనాన్ని వ్యక్తం చేసిన డ్యాన్సర్లు, తాము వెళ్లిపోతామనడంతో వివాదం మరింతగా పెరిగి, వారితోను, నిర్వాహక సంస్థపైనా ఏజంట్లు గొడవకు దిగారు. పార్టీ మధ్యలోనే ముగియగా, విషయం మీడియాకు ఎక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి నిర్వాహకులను గుర్తించే పనిలో ఉన్నారు.

ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్నూలులో కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే రేవ్ పార్టీ వ్యవహారం బయటపడింది. మళ్లీ ఇప్పుడు మరోసారి జరగడం కలకలంరేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -