Sunday, May 12, 2024
- Advertisement -

మరో వికెట్ః తెరాసలోకి కాంగ్రెస్ రెడ్డిగారి అబ్బాయి..!

- Advertisement -

ఇప్పటికే తెలంంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉండి వేచి ఉండే ఓపిక లేని రాజకీయ నేతలు తెరాసలోకి చేరిపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు..

తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల్లో నేతలు మిగులుతారా? అనే సందేహం జనించే స్థాయిలో తెరాస వైపు వలసలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే డి. శ్రీనివాస్ వంటి వాళ్లు తెరాస వైపు చేరిపోయారు. 

ఇక ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డి కుటుంబం కూడా తెరాస వైపు ఆకర్షితురాలవుతోందని వార్తలు వస్తున్నాయి. జానారెడ్డి కాదు కానీ.. ఆయన తనయుడు తెరాసలోకి చేరే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం జానారెడ్డి తెలంగాణ సీఎల్పీ చీఫ్ గా ఉన్నాడు. క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఉన్నాడాయన. మరి ఆయన తనయుడు ఇప్పుడు తెరాసలో చేరితే అంతకన్నా విచిత్రం ఉండదు.

తండ్రి సీఎల్పీ అధ్యక్షుడిగా ఉండి.. తనయుడు కేసీఆర్ పార్టీలో చేరితే అదోకి చిత్రమైన విషయమే అవుతుంది. అయితే ఈ అంశం గురించి జానారెడ్డి కానీ.. ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. జానారెడ్డి తనయుడు తెరాసలో చేరతాడన్న విషయాన్ని వారు ఖండించనూ లేదు. అలాగని సమర్థించనూ లేదు. మరి ఈ వ్యవహారం లో ఏం జరుగుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -