రిలయన్స్ జియో ఎవరు ఊహించని ఆఫర్స్ తో ఇతర కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. దాంతో.. ఇతర కంపెనీలు కూడా.. ఏదో ఒక ఆఫర్తో జియోకు షాక్ ఇచ్చేందుకు ట్రై చేసిన.. జియో ముందు అవి తేలిపోతున్నాయి. అయితే జియోకు పోటీగా ఎయిర్టెల్ మాత్రమే ధీటైన ఆఫర్లతో జియోకు షాక్ ఇస్తోంది.
ఈ నెపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా జియోకే ఊహించని షాక్ ఇచ్చేలా.. బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రూ.345 రీఛార్జ్ ప్యాక్పై రోజూ 1 జీబీ డేటా, అదనంగా కాల్స్ సదుపాయంతో అందరికి షాకింగ్ సర్ఫ్రైజ్ ఇచ్చిన ఎయిర్టెల్ ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఉచిత డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 13 నుంచి యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్ పొందిన ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ్చర్యకరమైన ఆఫర్ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
{youtube}mItRoZFhs0E{/youtube}
Related