దేశవ్యాప్తంగా 500, 1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు. అయితే ఈ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు చిల్లర కోసం బాగా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పటల్.. పెట్రోల్ బంక్లో ఈ పాత నోట్లు తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పిన అక్కడ కూడా పాత నోట్లు తీసుకొని చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు.
ఇక చేతిలో డబ్బు లేక ఏటీఎం ముందర లైన్ కట్టి మరి డబ్బు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే.. ఈ కొత్త నోట్లు అన్ని వెళాల ఏటీఎం సదుపాయంగా ఉండే విధంగా చూడాలి జనాలు అంటున్నారు. ఇక బాగా బ్లాక్ మనీ ఉన్న బడా వ్యాపారవేత్తలు ఏం చేయాలో అర్ధంకాక నెత్తిగోకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసిన పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇచ్చే వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.
అయితే ఎక్కడ చూసిన పాత నోట్లకు కొత్త నోట్లు 30% నుంచి 50% వరకు వుపందుకుంది. మరి కొంత మంది అయితే ఎకంగా బంగారు షాపులపై పడి తెగ కొనేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఎంటంటే.. పది గ్రాముల బంగారు మార్కుట్ రేటు.. 30000 నుంచి 32000 వేలు ఉంటే.. ఎకంగా యాబై వేలు ఇచ్చి పది గ్రాముల బంగారం తీసుకోపవడానికి నల్ల కుబేరులు బంగారు షాపుల ముందు క్యూలు కడుతున్నారు. మరి బ్లాక్ మనీ ని వైట్ మనీగా మార్చుకోవడంలో ఇదో కొత్త రకం.
Related