తమిళనాడు లోని ఒక పెళ్లి లో జరిగిన ట్విస్ట్.. ఇప్పుడు దేశం మొత్త హల్ చల్ చేస్తోంది. పెళ్లి పీటలపై పెళ్ళి కొడుకు, కూతురు కూర్చున్నారు. పెళ్లి కొడుకుని వధువుకి తాళి కట్టమని చెప్పాడు పురోహితుడు. పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది.
{loadmodule mod_custom,GA1}
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెల్లురు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్ కు ముగ్గురు కుమారులు రంజిత్, రాజేష్, వినోద్ ఉన్నారు. వీరిలో రాజేష్, వినోద్ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం దగ్గరలోని మురుగన్ ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు చేసారి ఇరు కుటుంబాలు. పెళ్లి పీటలపై కూర్చున్న రాజేష్ వధువు మెడలో మంగళ సూత్రం కట్టడానికి లేస్తుండగా పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్, అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు.దీంతో అక్కడున్నవారంత ఒక్కసారిగా షాక్ అయ్యారు.
{loadmodule mod_custom,GA2}
వధువు బంధువులు వినోద్పై విరుచుకుపడ్డారు. తల్లితండ్రులు అసలు విషయం కనుక్కోగా రాజేష్కు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడే తనకు వధువు పరిచయం అయ్యిందని, అప్పటి నుండి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపాడు వినోద్. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. దీంతో పెళ్లి పీటలపై ఉన్న పెళ్లి కుమార్తెను చితక బాదారు. వరుడు రాజేష్ ఆవేదనకు గురై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
{youtube}CT7oHWNo5Z8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related