రిలయన్స్ జియో ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇవ్వడంతో ఇతర టెలికం కంపెనీలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. రిలయన్స్ జియో ఫ్రీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకునేలా ఆఫర్స్ ప్రకటిచడంతో ఇతర టెలికం కంపెనీలన్ని కూడా వరుసగా ఆఫర్స్ ప్రకటించడానికి రెడీ అవుతున్నాయి.
ఈ నెపథ్యంలోనే ప్రైవేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. మంగళవారం నుంచి నెలకు రూ.149 చెల్లించే ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 30 నిమిషాలు ఉచిత కాలింగ్ ఆఫర్ ప్రకటించింది. ఏ నెట్వర్క్కి అయినా ఈ 30 నిమిషాలు ప్రీగా మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా.. ఒకేసారి మూడు నెలలకు రూ.439 చెల్లిస్తే… మూడు నెలల పాటు ఏ నెట్వర్క్కి అయినా అన్లిమిటెడ్గా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ… ఉచిత ఆఫర్ల కాలంలోనూ బీఎ్సఎన్ఎల్ మార్కెట్ షేర్ ఒక శాతం వృద్ధి చెందిందని అన్నారు.
Related