తమిళనాడులో పెళ్లయిన మాజీ ప్రియుడిని కోరిక తీర్చాలంటూ బ్లాక్మెయిట్ చేసిన యువతి దారుణహత్యకు గురైంది. అసలు విషయంలో వెళ్తే.. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో ముత్తుమారి (21) చేపల ఎగుమతి కేంద్రంలో చేసేది. అక్కడే పనిచేసే మహరాజన్ (23)తో ఆమెకు పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల ప్రేమ సాగించిన వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన ప్రియుడితో విడిపోయింది.
దీంతో మహరాజన్ మరో యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అయితే ముత్తుమూరి మళ్లీ తన మాజీ ప్రియుడు మహరాజన్కు ఫోన్ చేసి గతంలో తనతో ఉన్న ఫొటోలు పోలీసులకు చూపించి రేప్ కేసు పెడతానని బెదిరిస్తోంది. తన కోరిక తీర్చాలని ఆమె ముత్తుమూరి వేధిస్తోంది. ఓ రోజు మారిముత్తు తన ప్రేమికుడు మహరాజన్ ఇంటికి వెళ్లింది.
మహరాజన్ తన భార్యకు మారిముత్తును తాను ప్రేమించిన విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత మారిముత్తును ఇంటి వద్ద దిగపెడతానంటూ ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో ఆమెను తూత్తుకుడి విద్యుత సబ్స్టేషన్ సమీపంలోని పొదలమాటుకు తీసుకెళ్లి కత్తితో పొడిచి ఆమెను హత్య చేసి పారిపోయాడు. పోలీసుల విచారణలో మారిముత్తుకు మహరాజన్కు ఉన్న సంబంధం తేలడంతో విచారించగా మహరాజన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు మహరాజన్ను అరెస్టు చేశారు.
Related