- Advertisement -
పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. బోసినవ్వులతో ఉన్న ఆ గాంధీతాత బొమ్మను చాలా మంది డ్రాయింగ్ గా వేశారనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. 1946 లో గాంధీగారు వైస్రాయ్ హౌస్ అంటే ఇప్పటి రాష్ట్రపతి భవన్ దగ్గర లార్డ్ ఫ్రెడ్రిక్ లారెన్స్ ని కలిశారట.
అప్పుడు గాంధీగారు నవ్వుతూ ఆయన పక్కన నిలబడినప్పుడు తీసిన ఫోటో అది. ఆ ఫొటోలో గాంధీ పిక్ ని క్రాప్ చేసి మిర్రర్ ఫోటో చేసి నోట్లపై ప్రింట్ చేశారు. 1987 లో మొదట 500 నోటు పై గాంధీతాత ఫోటోని ముద్రించారు. అప్పటి నుండి ఇక ప్రతీ నోటుపై గాంథీతాత నవ్వులు కనిపించే విధంగా చర్యలు చేపట్టారు.
Related