- Advertisement -
తమిళనాడు కాంచీపురంలో ఓ వింత ఘటన కలకలం రేపింది. కోడి గుడ్డులో పాముపిల్ల బయటపడటం చూసి జనం అవాక్కయ్యారు.కాంచీపురంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తోన్న మేఘనాథన్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. అతని భార్య ఆమ్లేట్ వేద్దామని గుడ్డు పగులగొట్టింది. కానీ అందులో ఓ పాము పిల్ల కనిపించడం వల్ల భయపడి భర్త, చుట్టుపక్కలవారిని పిలిచింది. వారు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.