Monday, April 29, 2024
- Advertisement -

జియో వాడేవారికి పేటీఎం సూపర్ ఆఫర్ ఇదే!

- Advertisement -
Paytm Jio Code Offer Get Rs 30 Discount On Jio Recharge Of Rs 303

రిలయన్స్ జియో వినియోగదారులకు పేటీఎం సూపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.303కి రీచార్జ్ చేసుకుంటే.. రూ.30 తక్షణ  (రెండుసార్ల వరకు) తగ్గింపుతో పాటు.. రూ.150 మూవీ టిక్కెట్స్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా రూ.499 అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసే వారికి కూడా ఆ ఆఫర్‌ వర్తించనుంది.

రిలయన్స్ జియో వచ్చాక ఇతర టెలికాం కంపెనీలు.. వివిధ రకాల ఆఫర్లను ఇస్తోంది. తమ మొబైల్ యూజవర్లను అమితంగా ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో జియో ఫ్రీ ఆఫర్ ఈనెల 31తో ముగియనుంది. దాంతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకోవడం ప్రత్యేక ప్యాక్స్‌ను కూడా జియో అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవలే జియో నెట్‌వర్క్‌ను ఆపరేటర్ల జాబితాలో చేర్చుతూ పేటీఎం నిర్ణయం తీసుకుంది.

జియో యూజర్లు పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది. జియో ఫ్రైమ్ యూజర్లకు ప్రకటించిన 303 రూపాయల ప్యాక్‌ను పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకుంటే 381 రూపాయల వరకూ అదనపు లాభాన్ని పొందొచ్చని పేటీఎం తెలిపింది. ఈ ప్యాక్ ను రెండు సార్లు రీచార్జ్ చేసుకుంటే.. 30 రూపాయల తక్షణ తగ్గింపును పేటీఎం ప్రకటించింది. అలాగే, 499 రూపాయల అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేయించుకుంటే.. ప్రతీ రీచార్జ్‌పై 150 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు పేటీఎం పేర్కొంది. అలాగే, 201 రూపాయల జియో యాడ్ ఆన్ ప్యాక్‌ను ఫ్రీగా పొందొచ్చని సంస్థ ప్రకటించింది. 

Related

  1. జియోకు మరో షాక్.. ఎయిర్‌టెల్ రూ. 150 ప్లాన్‌తో సూపర్ ఆఫర్
  2. జియోకు షాక్‌ ఇచ్చిన ఎయిర్‌టెల్.. సూపర్ ఆఫర్ ఇదే!
  3. జియో ప్రైమ్ లేకుంటే.. ఎంత నష్టమో తెలుసా..?
  4. ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -