Saturday, May 4, 2024
- Advertisement -

జ‌గ‌న్ పిలిస్తె ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెల్తా పోసాని…

- Advertisement -

వైసీపీకి సినీగ్లామ‌ర్ మ‌ద్ద‌తు పెరుగుతోంది. వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మ‌రింత సినీ న‌టుల మ‌ద్ద‌తు స‌భిస్తుంద‌న‌డంలో సందేహంలేదు. ఇప్ప‌టికె ఆపార్టీకి మ‌హిళా ఫైర్ బ్రాండ్ రోజాకు తోడు ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ న‌టుడి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆయ‌న ఎవ‌రో తెలుసుకోవాల‌నుకుంటున్నారా…?

విల‌క్ష‌న సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు , నిర్మాత అయిన పోసాని ముర‌ళి కృష్న‌. మ‌న‌సులో మాట‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం అయ‌న అల‌వాటు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం త‌రుపునుంచి పోటీ చేసి ఓట‌మిని చ‌విచూశారు. ఆఎన్నిక‌ల్లో ఆయ‌న పెట్టిన ఖ‌ర్చు కేవ‌లం 7 ల‌క్ష‌లు. ప్ర‌త్య‌ర్థులు మాత్రం ఒక్కోక్కోరు 10 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని తెలిపారు. అయితె ఇప్పుడు తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో పోటీచేయ‌న‌ని తేల్చిచెప్పేశారు.

గ‌త‌కొంత‌కాలంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందె. వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పిలిస్తే ఖ‌శ్చితంగా ఎన్నిక‌ల ప్రాచారం చేస్తాన‌ని తెలిపారు. ప‌వ‌న్ పిలిచినా జ‌న‌సేన లోకి వెళ్ల‌న‌న్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయి, చంద్రబాబుని మించిన పాలన అందించకపోతే, అప్పుడు ప్రశ్నిస్తా, ఇంకో పార్టీ గురించి ఆలోచిస్తా..’ అని సమాధానం చెప్పారాయన. వ‌చ్చె ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌కు మ‌రింత సినీ మ‌ద్ద‌తు పెరుగుతుంద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -