ముఖేష్ అంబానీ ఇండియన్ టెలికం రంగంలో జియో పంపి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో ఇస్తున్న ఆఫర్స్కి మిగిలిన టెలికం కంపెనీలు ఏం చేయాలో అర్ధంకాక దిమ్మతిరిగింది. అన్ని కంపెనీలను వణికించిన జియోకే దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చింది ఆర్కామ్. ముఖేష్ అంబానీ సోదరుడు ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆర్కామ్ ద్వారా మొబైల్ వినియోగదారులందరూ లాభపడేలా బంపర్ ఆఫర్ ప్రకటించారు.
కేవలం రూ.149 కే ఏ నెట్వర్క్కు అయినా అపరమితంగా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆర్కామ్ వినియోగదారులు 2జీనా 4జీనా అన్నదానితో సంబంధం లేకుండా బేసిక్ ఫోన్లు వాడే వారికి కూడా ఉపయోగపడేలా ఈ ఆఫర్ను అనిల్ ప్రవేశపెట్టారు.
ఈ ప్యాకేజీలో 300 ఎంబీ డాటా కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆర్కామ్ తాజా ఆఫర్ జియోను మించి ఉంది. జియోతో ఉపయోగం కేవలం నెట్ ఎక్కువగా వినియోగించుకునే వారికే యూజ్ఫుల్గా ఉంటోంది. ఆర్కామ్ ఆఫర్తో కాల్స్ చేసుకునే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. అనిల్ అంబానీ తాజా ఆఫర్ దెబ్బకు జియోకు షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ ఒరిస్సా, బీహార్, బెంగాల్, బీహార్లతో పాటు ఈశాన్య రాష్ట్రాలలోనూ అందుబాటులో ఉంటుంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.
Related