హైదరాబాద్లో కొన్ని ముఠాలు మైనర్ బాలికలను టార్గెట్గా వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే ఈ వ్యభిచార రాకెట్ గురించి ఎవరు నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. చదువుకోవాల్సిన వయసులో ఉన్న మైనర్ బాలికలు తమ శరీరాన్ని అమ్ముకుని కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నారు. బలవంతంగా ఇందులోకి నెట్టబడిన వారికి మాదకద్రవ్యాలు అలవాటు చేసి దారుణాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు బయటకు వస్తున్నాయి.
నమ్మిన వారి చేతుల్లో నయవంచనకు గురవుతోన్న ఆ బాలికలు తమ శరీరంను పుండులా మారుతుంటే తట్టుకోలేకపోతున్నారు. భరించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే తాజాగా పోలీసుల దాడుల్లో పట్టుబడిన ఓ 15 ఏళ్ల బాలిక విషయమే చూస్తే ఆమెకు ఉపాధి కలిపిస్తాం అని చెప్పి ఆమెతో రెండు నెలలుగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె ఎదురు తిరగకుండా ఆమెకు మాదకద్రవ్యాలను అలవాటు చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిన్న వయసులో భర్త మరణించిన వారిని, పేదలని టార్గెట్గా చేసుకొని.. రెండు నెలల పాటు బాలికలను చూసే అవకాశం ఉండదని చెప్పి.. తల్లిదండ్రులకు రూ.20,000- 50,000 వరకూ చేతికిచ్చి బాలికలను తమతో తీసుకెళతారు. ఈ రొంపులోకి ఒక్కసరి వచ్చాం అంటే వారు చెప్పినట్టు వినాల్సిందే. నివాస ప్రాంతాల మధ్య అయితే… పోలీసులకు అనుమానం రాదనే ఉద్దేశంతో అపార్ట్మెంట్స్లోనే ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక అందం, చదువు ఉన్న యువతులను పాస్పోర్ట్, టూరిస్టు వీసాలతో గల్ఫ్దేశాలకు పంపుతున్న ముఠాలు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. 12-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలను ఈ రొంపులోకి దించి కాసులు దండుకుంటున్నారు.
Related