Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీ టూర్….. విజయసాయి వ్యాఖ్యలను నిజం చేసిన బాబు

- Advertisement -

ప్రపంచానికి పాఠాలు చెప్పిన మేధావిగా తనను తాను పొగుడుకునే చంద్రబాబు…….చిన్న వయసులోనే జాతీయ రాజకీయాలను కూడా ఒడిసిపట్టిన మేధావిగా లోకేష్‌ని కూడా పొగుడుతూ ఉంటాడు. కానీ ప్రచార పటాటోపం పుణ్యమాని కొంతమందికైనా గొప్పగా కనిపించే అవకాశం తప్పితే కాస్త తరచి చూస్తే మాత్రం ఇద్దరూ కూడా చాలా మామూలు విషయాల్లో కూడా అజ్ఙానం, అమాయకత్వం బయటపెట్టుకుంటూ ఉంటారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి అసెంబ్లీ సాక్షిగా ఆవేశంగా స్పందించిన లోకేష్….ఆ అవినీతి ఆరోపణల్లో అవాస్తవాలు ఏమీ లేవని చెప్పేశాడు. దాంతో అవినీతి ఆరోపణలన్నీ నిజాలే అని ఒప్పుకున్నట్టయింది.

ఇక చంద్రబాబునాయుడు మరోరకంగా విజయసాయి చెప్పిన మాటలను నిజం చేశాడు. తన ఢిల్లీ టూర్ సందర్భంగా రాజకీయ పొత్తులు, రాజకీయ ప్రయోజనానికి సంబంధించిన విషయాలపై మీడియా అస్సలు వార్తలు రాయొద్దని…..రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన ఢిల్లీ టూర్ సాగుతున్నట్టుగా వార్తలు రాయాలని మీడియాకు సుద్దులు చెప్పాడు చంద్రబాబు. చంద్రబాబు ఈ మాటలు చెప్పక ముందే బిజెపికి దూరమైన చంద్రబాబు ఇప్పుడిక కొత్త మిత్రుల వేటలో భాగంగానే ఢిల్లీ వస్తున్నాడని విజయసాయి చెప్పుకొచ్చాడు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులనూ కలిసి తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్చలు చేయడానికి మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని చెప్పారు విజయసాయి. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు చెప్పిన మాటలు విజయసాయి మాటలు నిజాలే అని చంద్రబాబు ఒప్పుకున్నట్టుగా ఉండడం గమనార్హం.

చంద్రబాబు ఢిల్లీ టూర్ గురించి మీడియా జనాలు వాళ్ళకు అనిపించిన, కనిపించిన వార్తలు రాస్తారు. అది వాళ్ళ డ్యూటీ. కానీ చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పొత్తుల విషయాల గురించి రాయొద్దని………కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన ఢిల్లీ టూర్ సాగుతున్నట్టుగా వార్తలు అందించాలని మీడియాను కోరడం మాత్రం ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది. అలాగే చంద్రబాబు అమాయకత్వాన్ని కూడా బయటపెడుతోంది. చంద్రబాబు రాజకీయ ఉద్ధేశ్యాలన్నీ స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోంది అని ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -