Friday, April 19, 2024
- Advertisement -

బాబు, లోకేష్ ఆస్తుల ప్రకటన డాబు…… ఎక్కడ? ఏమైంది? ఎందుకు లేదు?

- Advertisement -

ప్రపంచంలోనే చంద్రబాబు ఆస్తుల ప్రకటన అంత కామెడీ వ్యవహారం ఇంకొకటి ఉండదేమో. సంవత్సరానికి ఒకసారి ఆ తంతు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ ఆస్తుల ప్రకటన తర్వాత నుంచీ కూడా పచ్చ మీడియా మొత్తం కూడా ఇండియాలోనే ఇలాంటి నాయకుడు లేడు. నారా వారి ఫ్యామిలీ….ది గ్రటే్ అని బాకాలు అందుకుంటుంది. జాకీలేస్తూ బాబు ఫ్యాిమిలీని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పచ్చ బ్యాచ్ వ్యూహాలు బాగా పనిచేసి 2014 ఎన్నికల సమయంలో కాస్త కలిసొచ్చినట్టుగానే ఉంది. వాచ్ లేదు, డబ్బులు లేవు అని బాబుగోరు కూడా టైం దొరికినప్పుడల్లా అబద్ధాలు బాగానే చెప్పి జనాలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. బాబు ఆస్తుల ప్రకటన వ్యవహారం అంతా కూడా మేధావులకు, ఆలోచనాపరులకు మాత్రం పిచ్చ కామెడీ వ్యవహారంలా అనిపించేది. బంజారాహిల్స్ ఎకరం స్థలం రేటు మామూలుగా వంద కోట్లపైన ఉంటే బాబు ఆస్తలు ప్రకటనలో మాత్రం కనీసం లక్షల్లో కూడా ఉండదు. అలా ఉంటుంది వ్యవహారం. ఇక సోషల్ మీడియాలో కూడా బాబు ఆస్తుల ప్రకటన వ్యవహారం పిచ్చ కామెడీ అయిపోతూ ఉంటుంది.

అయితే ఈ సారి మాత్రం ఆ కామెడీ వ్యవహారం ఎందుకు లేదా? అని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. నోట్ల రద్దుకు రెండు మూడు రోజుల ముందే హెరిటేజ్ డీల్స్‌ని సక్సెస్ చేసుకని లాభపడ్డ వ్యవహారం బయటపడుతుందనా అని సోషల్ మీడియా జనాలు అడుగుతున్నారు. మామూలుగా అయితే సెప్టెంబర్-అక్టోబర్ సమయానికల్లా బాబు ఆస్తుల ప్రకటన జరిగిపోవాలి. ప్రతి సంవత్సరం ఆయా నెలల్లోనే ప్రకటిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఏమైంది? డిసెంబర్ వచ్చినా కూడా ఇంకా ఆ ఊసులేదేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నే నెటిజనులు అడుగుతున్నారు? ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటా….ట్రెండ్‌ని ఫాలో అవుతా అని చెప్పుకునే బాబులిద్దరూ ఇఫ్ఫుడు ఎందుకు స్పందించడం లేదు? టిడిపి జనాలు కానీ, బాబు భజన మీడియా బ్యాచ్ కానీ ఎందుకు బాబు ఆస్తుల ప్రకటనను అస్సలు పట్టించుకోవడం లేదు? మామూలుగా అయితే ఇలాంటి విషయాల్లో బాబు అండ్ కో స్పందించక ముందే తగుదునమ్మా అంటూ దూరిపోయి మరీ పిచ్చ కామెడీ కారణం ఏదో చెప్పి నవ్వించడం తోక పత్రికకు అలవాటు.

మరి ఈ సారి ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు? ఆస్తుల ప్రకటన వ్యవహారానికి మంగళం పాడిసినట్టేనా? అసలే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని మోడీ మనసులో ఏముందో అర్థం కాక పచ్చ బ్యాచ్ మొత్తం పిచ్చ టెన్షన్‌లో ఉన్నారు. ఈ సమయంలో అనవసరంగా తలగోక్కోవడం ఎందుకు? అనుకున్నారా? తెరవెనుక వ్యవహరం ఏమై ఉంటుంది? ఏది ఏమైనా ఇప్పుడు నారా వారి ఆస్తుల ప్రకటన వ్యవహారం నెటిజనుల్లో హాట్ టాపిక్ అయింది. నారా బాబులు సమాధానం చెప్తారా? పచ్చ మీడియా ఏమని బుకాయిస్తుంది? సీమాంధ్రను ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నంలో బిజీగా ఉండి ఆస్తుల ప్రకటనకు సమయం లేకుండా పోయిందని చెప్తుందా? అంతటి ఘటనా ఘటన సమర్థులే. చంద్రబాబు కొరియాలో ఫ్లైట్ కూడా దిగకముందే కొరియాలో ఉన్న పెట్టుబడిదారులందరూ అమరావతికి రావడానికి క్యూ కడుతున్నారని రాయగా లేనిది ఇలా రాయడం ఏమైనా కష్టమా? బాబు అండ్ ఆయన మంత్రులు, అధికారుల విదీశీ టూర్ల దెబ్బకు ఖజానా ఖల్లాస్ అయిపోతోందని ప్రభుత్వ వ్యవస్థలే చెప్తున్నాయి. కానీ పచ్చ మీడియాకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ చంద్రబాబు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆస్తుల వ్యవహారంలో కూడా అలాంటి మాయ కారణాలు, అబద్ధాలు ఏదో ఒకటి చెప్పడం అయితే ఖాయం. సీమాంధ్ర జనాలు ఇంకా ఎంతకాలం నమ్ముతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -