Friday, April 26, 2024
- Advertisement -

కుప్పకూలిన ఇంగ్లాండ్​ జట్టు.. స్కోర్ ఎంత అంటే..!

- Advertisement -

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిఇన్నింగ్స్​లో 205 పరుగులకే ఇంగ్లాండ్​ జట్టు కుప్పకూలిపోయింది. ఆల్​రౌండర్​ స్టోక్స్​ అర్థశతకం మినహా ప్రత్యర్థి జట్టులో మిగిలిన ఆటగాళ్లెవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్​ పటేల్​ 4 వికెట్ల పడగొట్టగా.. అశ్విన్​ 3, సిరాజ్​ 2, సుందర్​ ఒక వికెట్​ సాధించాడు.

తొలి సెషన్​లో వెనువెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్​.. రెండో సెషన్​లో ఆచితూచీ ఆడింది. ఓపెనర్లు విఫలమైన వేళ బెన్ స్టోక్స్(55) అర్ధ శతకంతో రాణించాడు. టీ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఈ సెషన్​లో సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.

రెండో సెషన్ ఆరంభంలోనే బెయిర్​స్టో(28*) ను ఎల్బీగా పెవిలియన్ పంపించాడు సిరాజ్. ఆ తర్వాత ఓలీ పోప్​తో కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దిన బెన్​ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్​ను పోటీలోకి తీసుకొచ్చాడు. 47వ ఓవర్​లో వాషింగ్టన్ సుందర్ అతడిని బోల్తా కొట్టించాడు.

పోలీసుల కొత్త ప్రయత్నం .. చూస్తే నవ్వుకోవడం పక్కా..!

ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు ట్రైలర్…!

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -