అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిఇన్నింగ్స్లో 205 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలిపోయింది. ఆల్రౌండర్ స్టోక్స్ అర్థశతకం మినహా ప్రత్యర్థి జట్టులో మిగిలిన ఆటగాళ్లెవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్ల పడగొట్టగా.. అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ ఒక వికెట్ సాధించాడు.
తొలి సెషన్లో వెనువెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. రెండో సెషన్లో ఆచితూచీ ఆడింది. ఓపెనర్లు విఫలమైన వేళ బెన్ స్టోక్స్(55) అర్ధ శతకంతో రాణించాడు. టీ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఈ సెషన్లో సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.
రెండో సెషన్ ఆరంభంలోనే బెయిర్స్టో(28*) ను ఎల్బీగా పెవిలియన్ పంపించాడు సిరాజ్. ఆ తర్వాత ఓలీ పోప్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్ను పోటీలోకి తీసుకొచ్చాడు. 47వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అతడిని బోల్తా కొట్టించాడు.
పోలీసుల కొత్త ప్రయత్నం .. చూస్తే నవ్వుకోవడం పక్కా..!