Tuesday, May 14, 2024
- Advertisement -

విరాట్ – అనుష్క‌లకు ఇట‌లీలో పెళ్లి చేసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చింది ఆయ‌నేనంట‌…

- Advertisement -

ప్రపంచంలో ఇటలీతో పాటు ఎన్నోఅందమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఇటలీలోనే ఎందుకు పెళ్లిచేసుకున్నట్లు అని ఆలోచిస్తున్నారా…? దానికి కార‌నం ఉంది. పెళ్లి వేడుక‌కు వేదిక‌గా ఇట‌లీనే ఎంచుకోవ‌డం వెనుక ఓ వ్య‌క్తి ఉన్నారు. అయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారా….?

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత, నటి రాణీ ముఖర్జీ భర్త య‌శ్‌రాజ్ ఫిలింస్ అధినేత‌ ఆదిత్య చోప్రానేనట. ఆదిత్య.. రాణి ముఖర్జీని 2014లో ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘రబ్‌ నే బనాది జోడీ’ చిత్రంతోనే అనుష్క బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ఆదిత్య నిర్మాణ సంస్థ ‘యశ్‌రాజ్‌ ఫిలింస్‌’తో అనుష్క మూడు సినిమాలకు సంతకం చేసింది. అలా ఆమె వరుస సినిమాలతో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

భార‌త్‌లో ఎక్క‌డ పెళ్లి చేసుకున్నా మీడియాకు తెలిసిపోయి హడావుడి సృష్టిస్తార‌ని, ప్ర‌శాంతంగా పెళ్లి జ‌ర‌గాలంటే ఇట‌లీలో చేసుకోవాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఆయ‌న రాణీ ముఖ‌ర్జీని 2014లో ఇట‌లీలోనే పెళ్లాడారు. ఆదిత్యను మెంటర్‌గా భావించే అనుష్క ఆయన సలహా ప్రకారమే విరాట్‌ను ఇటలీలోని టస్కనీలో వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -