Saturday, April 20, 2024
- Advertisement -

కుమార్తెతో రహానే సరదా సరదాగా!

- Advertisement -

ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ టెస్టు సిరీస్‌ విజయంతో టీమిండియా లంకపై టెస్టు సీరీస్‌ క్లీన్‌ స్వీప్‌తో ఇంగ్లండ్‌ జోరు మీదున్నాయి. ఈ రెండు జట్ల మధ్య భారత్‌లో మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్టు సమరం మొదలు కానుంది. ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా టీమిండియా క్రికెటర్లు స్థానిక హోటల్‌లో 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే, ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.

దీంతో కొంతమంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యా, పిల్లలతో చెన్నైలో వాలిపోయారు. అందరూ క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే హోటల్‌ రూమ్‌లో తన కూతురుతో కలిసి ఓ పాటకు స్టెప్పులు వేశాడు. తొలి రోజు సరదాగా గడిచిందంటూ అతని భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో కుమార్తెతో కలిసి రహానే స్టెప్పులు వేస్తున్న వీడియో షేర్‌ చేసింది. ‘క్వారంటైన్‌ మొదటి రోజు ఫుల్‌ వినోదం’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు జరగనుంది.

కోహ్లి నువ్వు సూప‌ర్‌.. నీకు తిరుగులేదు!

గంగూలీకి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్.. పెళ్లి చేసుకుందాం అంటూ 14 లక్షలకు టోపీ!

ఏపీ టీడీపీ అధ్యక్షుడికి పోలీసుల నోటీసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -