Monday, April 29, 2024
- Advertisement -

రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌లోకి అర్జున్ టెండూల్కర్..

- Advertisement -

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు.  ఈ నెల 18న చెన్నైలో మెగాటోర్నీ వేలం నిర్వహించనుండగా మొత్తం 1,097 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో జూనియర్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.

ఇక 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.  అండర్-19 టోర్నీలలో అర్జున్ దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో ఐపీఎల్‌ గత సీజన్‌లలో పేరు నమోదు చేసుకునే అర్హత లేకుండా పోయింది.

ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జూనియర్ టెండూల్కర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌ వేలానికి అర్హత సాధించాడు. ఈసారి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడో లేదో చూడాలి.

నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌.. అది మీడియాను ఎంగేజ్ చేయ‌డానికేనా

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

ఎంసెట్ సమస్య.. ఓ కొలిక్కి.. ఇలా చేస్తే ర్యాంక్ ఫిక్స్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -