Monday, May 6, 2024
- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

- Advertisement -

టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్ హీరో కాంబినేషన్ భలే హిట్ గా నిలుస్తాయి. అలాంటి హిట్ కాంబినేషన్ విషయానికి వస్తే త్రివిక్రమ్-పవన్, అల్లు అర్జున్. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక రవితేజ కెరీర్లో దర్శకుడు పూరి జగన్నాథ్ పాత్ర కీలకమైనది. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న రవితేజ కి మంచి బ్రేక్ ఇచ్చింది పూరి జగన్నాధ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. వంటి సినిమాల ద్వారా రవితేజకు మంచి విజయాలను ఇవ్వడమే కాకుండా.. హీరోగా ఆయన ఇమేజ్ ను పెంచే పాత్రలను కూడా పూరి ఇచ్చాడు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో వీరి కాంబినేషన్ లో సుమారు తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చింది. 

తాజాగా వీరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కథను కూడా పూరి ఇప్పటికే సిద్ధం చేసినట్టు, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు టాలీవుడ్ టాక్.

ఇండియాతో తొలి టెస్టు.. రూట్ సేన‌దే పైచేయి!?

ఇంటింటికీ రేషన్ పై నిమ్మగడ్డ రమేశ్‌ కన్ను..!

ఈ నెల 7న ముహూర్తం పెట్టిన సీఎం కేసీఆర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -