- Advertisement -
తమిళనాడులోని నాగర్కోయిల్ వేదికగా ఈ నెలలో జరగాల్సిన జాతీయ వెయిట్లిఫ్టింగ్ పోటీలు(పురుషులు/మహిళలు) వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య సెక్రటరీ సహ్దేవ్ యాదవ్ స్పష్టం చేశారు.
జాతీయ వెయిట్లిఫ్టింగ్ పోటీలను మార్చి 14 నుంచి 17 వరకు నిర్వహించాల్సింది. అయితే టోర్నీ వాయిదా పడిన నేపథ్యంలో ఇదే వేదికగా వచ్చే నెలలో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని యాదవ్ తెలియజేశారు. జాతీయ వెయిట్లిఫ్టింగ్ పోటీలను గత ఎడిషన్ను కోల్కతాలో నిర్వహించారు.
భద్రతా దళాల కోసం కదిలిన మోదీ.. సదస్సు కి సిద్ధం..!
రామ్ చరణ్ తో చిందులేయబోతున్న జిగేల్ రాణి!