విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికాని తొలి ఇన్నీంగ్స్ పోరు ముగిసింది. 431 పరుగలుకు సఫారీలను టీమిండియా ఆలౌట్ చేసింది. దీంతో భారత్ కు 71 పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఆటలో నాలుగో రోజైన శనివారం 385/8తో మొదటి ఇన్నింగ్స్ని కొనసాగించిన సఫారీలు తొలి సెషన్లోనే 431 వద్ద కుప్పకూలిపోయారు. దీంతో.. తొలి ఇన్నింగ్స్ని 502/7తో డిక్లేర్ చేసి ఉన్న భారత్ జట్టుకి 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో డీన్ ఎల్గర్ (160: 287 బంతుల్లో 18×4, 4×6), డికాక్ (111: 163 బంతుల్లో 16×4, 2×6) శతకాలు సాధించగా.. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఏడు, జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు.
ఓవర్నైట్ ఆటగాడు కేశవ్ మహరాజ్(9;31 బంతుల్లో 1ఫోర్) తన వంతు పోరాటం చేసి తొమ్మిదో వికెట్గా ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, మరో ఓవర్నైట్ ఆటగాడు ముత్తుస్వామి మాత్రం భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించాడు. 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.