Monday, May 6, 2024
- Advertisement -

భార‌త్‌కు ఆదిలోనె ఎదురు దెబ్బ మొద‌టి వికెట్ కోల్పోయిన కోహ్లీ సేన‌…

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా మాంచెస్ట‌ర్‌లో విండీస్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్‌కు ఆదిలోనె ఎదురు దెబ్బ త‌గిలింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో సిక్స్ బాది జోరుమీద కనిపించిన రోహిత్ శర్మ (10: 23 బంతుల్లో 1×4, 1×6) అదే ఓవర్‌ ఆఖరి బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొద‌ట టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుక‌న్న సంగ‌తి తెలిసిందే.

ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లాడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసే అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. దీంతో.. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అఫ్గానిస్థాన్‌పై ఆడిన టీమ్‌నే కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌కీ కొనసాగించాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -