- Advertisement -
భారత్తో ఐదో వన్డేకు కివీస్ సిద్దమవుతోంది. ఐదు వన్డేల సిరీస్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత నాలుగో వన్డేలో ఊహించని విజయం అందుకున్న కివీస్ జట్టు.. ఆఖరి వన్డేలోనూ అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. అయితే విధ్వంసకర బ్యాట్స్మేన్ గుప్తిల్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోహ్లీ, ధోనీ లేకపోవడంతో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలో మరో సారి పుంజుకోవాలని చూస్తోంది. చివరి వన్డేపై ఆసక్తి నెలకొనగా.. ఈరోజు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ మార్టిన్ గప్తిల్ గాయపడినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో కొలిన్ మున్రో మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.