Saturday, May 4, 2024
- Advertisement -

దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

- Advertisement -

మూడు టీ 20 మ్యాచ్‌ సిరీస్ ద‌క్షిణాఫిక్రాతో భార‌త్ సిద్ధ‌మైంది. ద‌క్షిణాఫ్రికాకు వెళ్లే జ‌ట్టును ఎంపిక క‌మిటీ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక‌ను చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జ‌రిగింది.ఈ మేరకు జట్టును ప్రకటించారు. ఫిబ్రవర్‌ 1 నుంచి ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ ఆరు వన్డేల సిరీస్ కూడా ఉంది. దీనికోసం భార‌త జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. వీటి ద‌ర్వాత ట్వంటీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.
 
ఇటీవ‌ల మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికాతో 2-1 తేడాతో జ‌రిగింది.  మూడో టెస్టులో అన్నింట్లో ప్రతిభ కనబర్చి 63 పరుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి కొంచెం ప‌రువు నిలుపుకుంది. వన్డే సిరీస్‌ ముందు ఈ విజయం టీమిండియాకు ఉత్సాహాన్నిచ్చింది.
 
టీ ట్వంటీ సిరీస్ జ‌ట్టు ఇదే
భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, ధోని, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దుల్‌ థాకూర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -