- Advertisement -
ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. జట్టులో స్టార్ బ్యాట్సమెన్లు ఉన్నా ఒక్క విజయం కోసం ఆపసోపాలు పడుతోంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఖాతా తెరవని జట్టు కోహ్లీసేనే. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరగిన పోరులో బెంగళూరు గెలుస్తుందేమోనని అనుకుంటే అదీ జరగలేదు. వరుసగా నాలుగో పరాజయంతో కోహ్లీసేన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో బెంగళూరు తలపడనుంది. ఇవాళ్టి మ్యాచ్లోనైనా బెంగళూరు బోణీ చేస్తుందా లేక ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంటుందా అనేది చూడాలి