Friday, March 29, 2024
- Advertisement -

ముంబై ఇండియ‌న్స్‌కు వార్నింగ్ ఇచ్చిన ఏబీ డీవిలియ‌ర్స్‌..

- Advertisement -

ఐపీఎల్ సీజన్ 12 గ్రూప్ షెడ్యూల్‌లో భాగంగా నేడు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జ‌రుగుతున్న మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కీ కీల‌కం కానుంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఈ జట్లు… మొదటి మ్యాచ్‌లో ఆశించిన స్థాయి ఆటతీరు ప్రదర్శించలేకపోయాయి. ముంబయి, బెంగళూరు మధ్య ఈరోజు రాత్రి 8 గంటకి మ్యాచ్ జరగనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తేలిపోయిన బెంగళూరు పేలవంగా ఓడిన విషయం తెలిసిందే. మ‌రో వైపు ముంబ‌య్ కూడా ఢిల్లీ డేర్ డేవిల్స్ చేతిలో పోరాడి ఓడింది. ఇరు జ‌ట్ల‌కు మ్యాచ్ కీల‌కం కానున్న నేప‌ధ్యంలో ముంబ‌య్ బౌల‌ర్ల‌కు ఆర్‌సీబీ బ్యాట్స్ మేన్ హెచ్చ‌రిక‌లు పంపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన బుమ్రా ఆడేది అనుమానంగానె ఉన్నా ముంబ‌య్ మాత్రం బ‌రిలోకి దిగుతాడ‌ని వెల్ల‌డించింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రాతో ఈరోజు మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌కి ముప్పు తప్పదా..? అని ఏబీ డివిలియర్స్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రా చాలా మంచి బౌలర్. కానీ.. అతడ్ని కూడా ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలూ లేకపోలేద‌న్నాడు. ఇక ఈరోజు మ్యాచ్ జరిగే చిన్నస్వామి స్టేడియంలో.. బౌండరీ లైన్ కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి.. ఈరోజు బౌలర్లకి ఒత్తిడి తప్పదు’ అని డివిలియర్స్ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -