Saturday, April 27, 2024
- Advertisement -

IPL 2024:ఆర్సీబీపై చెన్నై గెలుపు..

- Advertisement -

ఐపీఎల్‌ 2024లో భాగంగా బోణి కొట్టింది చెన్నై. చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది సీఎస్‌కే. ఆర్సీబీ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మొదటి నుండే దూకుడుగా ఆడింది.

శివం దుబే (34), రహనే(27, రచన్ రవీంద్ర (37) మిచెల్ (22), జడేజా (25) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 173 పరుగులు చేసింది. డూప్లెసిస్ (35), విరాట్ కోహ్లీ (21), అనుజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38) పరుగులు చేశారు.

ఇక ఇవాళ వీకెండ్ కావడంతో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్ తో డిల్లీ క్యాపిటల్స్ , రాత్రి 7 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -