Monday, April 29, 2024
- Advertisement -

‘సూపర్‌ ఓవర్‌’లో ఢిల్లీ ఘ‌న విజ‌యం

- Advertisement -

ఐపీఎల్ 12వ సీజ‌న్‌లో ఉత్కంఠ మ్యాచ్ శ‌నివారం జ‌రిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లు సాగింది. ఇరు జ‌ట్లు సమాన స్కోరు సాధించ‌డంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. సూప‌ర్ ఓవ‌ర్లో అద్బుత బౌలింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం సాధించింది. ఢిల్లీ ఫిరోషా కోట్ల మైదానంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్‌ ( 62) మళ్లీ రెచ్చిపోయాడు.

దినేశ్‌ కార్తీక్‌ (50) అర్థ సెంచ‌రీతో రాణించాడు. అనంత‌రం 186 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ త‌న ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ఆరంభించింది. పృథ్వీ షా( 99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ( 43) రాణించాడు. పృథ్వీకే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.ఈ మ్యాచ్ విజ‌యంతో ఢిల్లీ రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -