- Advertisement -
కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రాహుల్, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. ఇద్దరిపై బీసీసీఐ విధించిన నిషేధం విధించింది. అయితే ఇద్దరూ క్షమాపనలు చెప్పడంతో తాత్కాలికంగా ఇద్దరిపై నిషేధాన్ని తొలగించింది బీసీసీఐ.
దీంతో హార్థిక్ న్యూజిలాండ్ పర్యటనలో, కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ లయన్స్-భారత్-ఏ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచుల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కరణ్, రాహుల్, పండ్యాలపై రాజస్థాన్లోని జోధ్పూర్లో కేసు నమోదయ్యింది.రాహుల్తో పాటు కరణ్ జోహార్పై కేసు నమోదైనట్లు ప్రముఖ మీడియ సంస్థ వెల్లడించింది.