Friday, May 17, 2024
- Advertisement -

29న కాన్పూర్‌లో మూడో వ‌న్డే….

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌ను స‌మం చేసింది భార‌త్‌. మొద‌టి వ‌న్డేలో గెలిచిన న్యూజిలాండ్ రెండో వ‌న్డేలో ఓట‌మి పాల‌య్యింది. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో భార‌త్‌ ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. కాన్పూర్‌లో ఆదివారం జరిగే అంతిమ సమరంలో రెండు జట్లు చావోరేవో తేల్చుకుంటాయి.

టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ను కచ్చితంగా గెలిచి తీరుతామని న్యజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంత్నార్ అన్నారు. భారత్ తో జరిగిన రెండో వన్డేలో తమ ఆటగాళ్ల ప్రదర్శన నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన ఆఖరి వన్డేలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వబోమన్నాడు. ఈ క్రమంలోనే సిరీస్ ను 2-1తో సాధిస్తామంటూ జోస్యం చెప్పాడు.

‘రెండో వన్డేలో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింద‌ని మూడో వ‌న్డేలో అలాంటి తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని కాన్పూర్ వన్డేకు సిద్ధమవుతున్నాం. గతేడాది సిరీస్ ను కోల్పోయినట్లు ఈసారి జరగనివ్వం. మూడో వన్డేలో బ్యాటింగ్ లో మా సత్తా చూపెట్టి సిరీస్ ను సాధిస్తాం’అని సాంత్నార్ ధీమా వ్యక్తం చేశాడు.

రెండో వన్డేలో విజయం సాధించడానికి పూర్తి అర్హత ఉందని, ప్రధానంగా వారి బౌలర్లు అమోఘంగా రాణించి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారన్నాడు. మొదటిసారి బ్యాటింగ్ చేసే క్రమంలో తొలి పది ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమను తేరుకోనీయకుండా చేసిందన్నాడు. మూడో వ‌న్డేలో రెండు జ‌ట్లూ అమీతుమీ తేల్చుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -