Monday, April 29, 2024
- Advertisement -

టీ20 ల్లో స‌రికొత్త రికార్డును సాధించిన రోహిత్‌…

- Advertisement -

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో రోహిత్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇక్కడ మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును రోహిత్‌ అధిగమించాడు. ప‍్రస్తుతం రోహిత్‌(2,288) తొలి స్థానాన్ని ఆక్రమించగా, గప్టిల్‌(2277) రెండో స్థానంలో ఉన్నాడు. షోయబ్‌ మాలిక్‌(2263) మూడో స్థానంలో, విరాట్‌ కోహ్లి(2167)లు నాల్గో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ మరో రికార్డు సాధించాడు. తాజా హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ శర్మ యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని 20 సార్లు సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -