- Advertisement -
భారత్ స్టార్ బ్యాట్ షెట్లర్ పివి. సింధు ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లో ఓటమి పాలయ్యింది. జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో సింధు ఓడిపోయింది. 21-14, 21-9 తేడాతో సింధుపై యమగుచి విజయం సాధించింది. మొదటి గేమ్ లో ఇద్దరు క్రీడాకారిణులు నువ్వా? నేనా? అన్నట్టు తలపడ్డప్పటికీ, యమగుచి 17-14 స్కోరుతో లీడ్ లో ఉండటంతో దూసుకుపోయింది. రెండో గేమ్ లో మాత్రం యమగుచి చెలరేగి ఆడటంతో సింధు ఈ గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
అయితె ఫ్రెంచ్ ఓపెన్ లో సెమీస్ కి చేరడం సింధుకు ఇదే మొదటిసారి. చైనా షట్లర్ యుఫీతో నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించింది. అయితే,ఈ రోజు జరిగిన సెమీస్ లో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుతుందని ఆశించిన సింధు అభిమానులకు నిరాశే ఎదురైంది.