శ్రీలంకతో సిరీస్, కోహ్లి పెళ్లి సందడి అయిపోయింది. 2017 అంతా టీమిండియా విజయాలనే నమోదు చేసింది. ఇప్పుడు ఖటినమైన దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు సిద్దమయ్యింది. అయితే టెస్ట్సిరీస్కు ఆదిలోనే సఫారీల జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ డికాక్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు.
జింబాబ్వేతో ప్రయోగాత్మకంగా మంగళవారం ఆరంభమైన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ని ఆడుతూ.. డికాక్ బుధవారం గాయపడ్డాడు. దీంతో డికాక్ స్థానంలో ప్రస్తుత జట్టు తాత్కాలిక కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. జనవరి 5 నుంచి భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
జట్టు రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పూర్తి స్థాయిలో ఫిటెనెస్ సాధించలేకపోవడంతో జింబాబ్వేతో టెస్టు నుంచి అతను పక్కకి తప్పుకున్నాడు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన డివిలియర్స్కి.. తాజాగా కీపింగ్ రూపంలో అదనపు బాధ్యతలు వచ్చాయి. వెన్నునొప్పి కారణంగా గత ఏడాదన్నర నుంచి కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతూ విశ్రాంతి తీసుకున్న ఏబీ డివిలియర్స్.. కెప్టెన్సీని వదిలేసి ఇటీవల టెస్టు జట్టులోకి వచ్చాడు. డికాక్ తొడ కండరాలకి గాయమైందని.. భారత్తో తొలి టెస్టుకి అతను అందుబాటులో ఉండటంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ దక్షిణాఫ్రికా ప్రకటించింది.